అసలకే దెబ్బ మీద దెబ్బ తో అల్లాడుతున్న టీడీపీ పార్టీ కి టీటీడీపీ లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.ఇప్పటికే ఏపీ లో కూడా టీడీపీ పరిస్థితి దారుణంగా ఉండడం తో ఇక పార్టీ ని యువ నేతల చేత నడిపించాలని చూస్తున్న ఈ సమయంలో టీటీడీపీ పార్టీ కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికల్లో పోటీ చేయాలనీ టీటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించిన మరునాడే ఆ పార్టీ కి చెందిన యువ నేత,మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ టీడీపీ కి గుడ్ బై చెప్పేశారు.ఆయన తెలుగు యువత అధ్యక్షుడిగా కూడా భాద్యతలు నిర్వర్తిస్తుండగా ఇప్పుడు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి తెలుగు యువత అధ్యక్ష పదవికి సైతం ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలో తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి పంపించారు.ఉన్నత ఆదర్శాలు, సిద్ధాంతాలతో ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీ ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం సిద్ధాంతాలకు భిన్నంగా టీడీపీ వ్యవహరిస్తోందంటూ లేఖలో ఆయన పార్టీ పై విమర్శలు చేశారు.
పార్టీకి సిద్ధాంతాలు లేకపోడమన్నది ఆత్మ లోపించడమేనని వ్యాఖ్యానించారు.అయితే వీరేందర్ గౌడ్ అక్టోబర్ 3న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.వీరేందర్ తో పాటు తండ్రి దేవేందర్ కూడా టీడీపీ లో చేరనున్నట్లు తెగ ప్రచారామ్ కూడా జరుగుతుంది.మరి దీనిపై స్పష్టత రావాలి అంటే ఈ నెల 3 వ తేదీ వరకు ఆగాల్సిందే.