మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలని లైన్ లో పెట్టారు.కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య మూవీ షూటింగ్ చివరి దశకి వచ్చేసింది.
ఇక ఈ సినిమా పూర్తికాగానే గ్యాప్ లేకుండా లూసీఫర్, వేదాళం రీమేక్ షూటింగ్ లు స్టార్ట్ చేస్తాడు.ఈ రెండు సినిమాలు పక్కా కమర్షియల్ మూవీలు కావడం, క్యారెక్టరైజేషన్ లో పెద్దగా వేరియేషన్స్ లేకపోవడం ఒకే సారి సెట్స్ పైకి తీసుకెళ్ళి షెడ్యూల్ వైజ్ గా ప్లాన్ చేయాలని భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఇప్పటికే ఈ రెండు సినిమాల దర్శకులు మూవీ ప్రీప్రొడక్షన్ పనులని పూర్తి చేసి షూటింగ్ కోసం రెడీగా ఉన్నారు.మరో వైపు క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.
మే మొదటి వారంలో లూసీఫర్ రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది.అదే నెలలో వేదాళం కూడా స్టార్ట్ చేయడానికి షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ రెండు రీమేక్ సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ స్ట్రైట్ కథని బాబీ దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే బాబీ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసి చిరంజీవికి వినిపించడం జరిగిందని, అతను కూడా చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పి ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా కథ నేపధ్యం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని, అది కూడా గ్రామంలో పెద్దమనిషి తరహలో చిరంజీవి పాత్ర ఉండబోతుందని సమాచారం.ఇక ఈ సినిమాకి వీరయ్య అనే టైటిల్ ని నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తుంది.
చిరంజీవి కూడా ఈ టైటిల్ పట్ల సంతృప్తిగానే ఉన్నాడని, అన్ని అనుకూలంగా జరిగితే త్వరలోనే టైటిల్ ఎనౌన్స్ మెంట్ ఉండే అవకాశం ఉందని ఫిలిం నగర్ లో చర్చించుకుంటున్నారు.