గంధపు చెక్కల స్మగ్లర్ కిల్లర్ వీరప్పన్ అంటే సౌత్ ఇండియాలో తెలియని వారు ఉండరు.కర్ణాటక, తమిళనాడు పోలీసులని ఏకంగా రెండు దశాబ్దాల పాటు గడగడలాడించిన పేరు మోసిన దొంగ మాత్రమే కాకుండా పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు తీసిన హంతకుడు కూడా.
పోలీసులకి సవాలు విసిరినా వీరప్పన్ ని అత్యంత తెలివిగా ట్రాప్ చేసి 2004లో తమిళనాడు ప్రత్యేక టాస్క్ఫోర్స్ అధికారులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.ఆ తరువాత వీరప్పన్ చరిత్ర పూర్తిగా కనుమరుగైంది.
అయితే వీరప్పన్ కుటుంబం జనజీవన స్రవంతి లోకి వచ్చి బ్రతుకుతున్నారు.వీరప్పన్ కథ ఆధారంగా సౌత్ ఇండియాలో అన్ని బాషలలో సినిమాలు వచ్చాయి.
ఇదిలా ఉంటే వీరప్పన్ కి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు.వారిలో పెద్ద కూతురు విద్యారాణి ఇటీవలే బీజేపీ పార్టీలో చేరారు.
ఇక రెండవ కూతురు విజయలక్ష్మి తమిళ్వురిమై పార్టీలో ఉన్నారు.
అయితే ఇప్పుడు ఆమె రాజకీయాలు కాకుండా సినీరంగంపై మక్కువ పెంచుకొని ఇటువైపుగా అడుగులు వేస్తున్నారు.
విజయలక్ష్మి కథానాయికగా ఓ సినిమా తెరకెక్కుతుంది.మావీరన్ పిళ్లై అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాని కేఎన్ఆర్ మూవీస్ పతాకంపై కేఎన్ఆర్ నిర్మించగా రాజ్శ్రీ దర్శకత్వం వహిస్తున్నారు.
దీనికి రవివర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ సినిమా ఫస్ట్ లుక్ ని సోషల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
మావీరన్ పిళ్లై చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లో విజయలక్ష్మి తండ్రి వీరప్పన్ గెటప్లో భుజాన తుపాకీ పట్టుకొని నిలబడ్డారు.దీనిని బట్టి ఈ కథ నేపధ్యం అయితే స్మగ్లింగ్ కాని, లేదంటే నక్శలైట్స్ ఎలిమెంట్స్ తో గాని ఉండే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.