పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరిహర వీరమల్లు’ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది.ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను మహాశివరాత్రి కానుకగా చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో ఈ సినిమా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది.
బందిపోటు పాత్రలో పవన్ నటిస్తున్న ఈ సినిమాను పీరియాడికల్ మూవీగా క్రిష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్కు చేరుకున్నాయి.ఇక ఈ సినిమాలో పవన్ లుక్ను చూసిన ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ లభించిందని చెప్పాలి.
కాగా ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.ఇక ఈ సినిమాకు బడ్జెట్ను కూడా అదే తరహాలో భారీ ఎత్తున కేటాయించారట చిత్ర యూనిట్.ఈ సినిమా కోసం ఏకంగా రూ.150 కోట్ల భారీ బడ్జెట్ను చిత్ర నిర్మాతలు కేటాయించినట్లు చిత్ర వర్గాల టాక్.పవన్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా రికార్డు కొట్టనుంది.కాగా ఈ సినిమాలో పవన్ పాత్ర ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే విధంగా దర్శకుడు క్రిష్ తీర్చిదిద్దుతున్నాడట.
ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్తో పాటు అదిరిపోయే సెట్స్ కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం చార్మినార్, ఎర్రకోట, మచిలీపట్నం పోర్టు వంటి భారీ సెట్స్ను ఏర్పాటు చేయనున్నారట.
ఇంత భారీ వ్యయంతో ఈ సినిమాను చిత్ర నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని పవన్ ఫ్యాన్స్ ఇప్పటినుండే లెక్కలు వేస్తున్నారట.కాగా ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్లు హీరోయిన్లుగా నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ ఓ రేంజ్లో ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.మరి ఈ సినిమాతో వీరమల్లుగా పవన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.