ప్రస్తుతం అంతా సంక్రాంతి పండుగలో రిలీజ్ కాబోయే సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు.మరి సంక్రాంతికి ఈసారి భారీ పోటీ నెలకొనబోతుంది.
టాలీవుడ్ నుండి రాబోతున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రాల్లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ”వీరసింహారెడ్డి” సినిమా ఒకటి.ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నాడు.
క్రాక్ వంటి సినిమాతో మాస్ హిట్ అందుకున్న గోపీచంద్ ఆ తర్వాత ఏకంగా బాలయ్యనే లైన్లో పెట్టి ఈయనతో సినిమా చేసాడు.మరి ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసి సంక్రాంతి బరిలో దింపబోతున్నాడు.
బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్ క్రేజీ సినిమా ‘వీరసింహారెడ్డి’ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఇప్పటికే వరుస సాంగ్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు.అలాగే తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది.ఇక మరొక వారం రోజుల్లోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో మంచి ఓపెనింగ్స్ అందుకోవడం ఖాయం అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
మరి ఇక్కడే కాదు ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా బాలయ్య తన హవా కొనసాగిస్తున్నాడు.ఒక్క యూఎస్ మార్కెట్ లోనే కాకుండా ఓవర్సీస్ లో ఎక్కడెక్కడ రిలీజ్ అవుతుందో అన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవల్ లో జరుగుతున్నాయని తెలుస్తుంది.
మిగతా సినిమాల కంటే కూడా రెడ్డిగారు ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తుంది.చూడాలి బాలయ్య ఎంతమేర ఓపెనింగ్స్ రాబడతాడో.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతుంది.