ఏపీలో విపక్ష టీడీపీకి వరుసగా కష్టాలు కొనసాగుతున్నాయి.గత ఎన్నికల్లో గెలిచిన కొద్ది రోజుల నుంచి ఆ పార్టీ నేతలు వరుసపెట్టి ఫ్యాన్ కిందకు చేరిపోతున్నారు.
ఈ క్రమంలోనే పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయ్యారు.వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి సైకిల్ దిగి ఫ్యాన్ కింద సేదతీరుతున్నారు.
ఇక ఇప్పుడు ఈ లిస్టులోనే మరో ఎమ్మెల్యే చేరిపోతున్నారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పార్టీకి గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
శనివారం ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.ఆయన వరుసగా రెండుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.గతంలో విశాఖ నగర టీడీపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.ఇక గత ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓడినా కూడా ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
కొద్ది రోజులుగా పార్టీ అధిష్టానంపై అలకతో ఉంటోన్న గణేష్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.అలాగే ఉత్తరాంధ్రలో వైసీపీ వ్యవహారాలు చూసే ఓ కీలక నేతతో టచ్లో ఉన్నాడనే అంటున్నారు.
జగన్ను కలిసిన అనంతరం ఆయన ప్రెస్ మీట్ పెట్టె అవకాశాలు ఉన్నాయి.అయితే గణేష్ వైసీపీ కండువా కప్పుకోకుండా ఆ పార్టీకి మద్దతు ఇవ్వనున్నారు.టీడీపీని వీడిన ముగ్గురు ఎమ్మెల్యేలు పరోక్షంగా వైసీపీకి మద్దతు ఇస్తున్నట్టే గణేష్ కూడా చేయనున్నారు.ఇక గణష్ బాటలోనే ఇదే విశాఖ నుంచి మరో ఎమ్మెల్యే సైతం సైకిల్ దిగిపోనున్నారని తెలుస్తోంది.
గ్రేటర్ విశాఖ ఎన్నికలపై ప్రధానంగా ఫోకస్ పెట్టిన వైసీపీ ఇక్కడ గెలిచిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల్లో ఇద్దరిని పార్టీకి దూరం చేయనుందని తెలుస్తోంది.