ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు కారణం వారే అంటూ తమిళ దర్శకుడు భాగ్యరాజా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారంను రేపుతున్నాయి.ఆయపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది.
మహిళ సంఘాల వారు ఆయన్ను తీవ్రంగా దుమ్మెత్తి పోస్తున్నారు.బుద్దిన్న వ్యక్తి మాట్లాడే మాటలేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.
మొత్తానికి ఆడవారిపై అఘాయిత్యాల విషయంలో భాగ్యరాజా చేసిన వ్యాఖ్యలు ఆయన కెరీర్ను దెబ్బ తీసే స్థాయికి చేరాయి.తాజాగా ఏపీ మహిళ కమీషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ కూడా స్పందించారు.
ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.ఒక బాధ్యతగల వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కావు ఇవి.ఇలాంటి మాటలు మాట్లాడినందుకు గాను ఆయన్ను చెప్పుతో కొట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.ఒక దర్శకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజలపై ఎంతో ప్రభావంను చూపిస్తాయి.
ఆయన వ్యాఖ్యలు అఘాయిత్యాలు పెంచే విధంగా ఉన్నాయంటూ పద్మ పేర్కొన్నారు.భాగ్యరాజాపై తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే అంటూ ఆమె డిమాండ్ చేసింది.
ఎట్టి పరిస్థితుల్లో ఆయనపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆమె డిమాండ్ చేస్తోంది.మరో వైపు తమిళనాట కూడా భాగ్యరాజాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.