మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు.ఇటీవల గద్దలకొండ గణేష్గా మనముందుకు వచ్చి హిట్ అందుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఓ సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు.
ఈ సినిమాలో హీరోయిన్గా తొలుత బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని అనుకున్నారు.
కానీ బాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉండటంతో ఆమె ఈ సినిమాకు నో చెప్పినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నిధి అగర్వాల్ను ఓకే చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో నిధి అగర్వాల్ అయితే వరుణ్ సరసన బాగా సెట్ అవుతుందని, అందుకే ఆమెను సంప్రదించినట్లు ఫిలిం నగర్లో టాక్ నడుస్తోంది.
కాగా ఇదే సినిమాలో మరో ముఖ్య పాత్రలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని మరో బ్యూటీ నభా నటేశ్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ సినిమా పుణ్యమా అని ఇద్దరు హీరోయిన్లకు తెలుగులో వరుసబెట్టి ఆఫర్లు వస్తుండటంతో వారి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
మరి మెగా ప్రిన్స్ పక్కన వీరు నటిస్తోంది లేనిది ఇంకా అఫీషియల్గా తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాను కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తుండగా అల్లు వెంకటేశ్, సిద్ధు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.