ప్రజలను హెచ్చరిస్తున్న వరుణ్ తేజ్.. ఎందుకంటే..!

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమయ్యింది.ముందుకన్నా వేగంగా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది.

 Varun Tej Shares Latest Photo On Instagram, Varun Tej, Instagram, Social Media,-TeluguStop.com

కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ కూడా పెట్టింది.అందుకే ఇప్పటికే షూటింగ్స్ అన్ని నిలిచి పోయి అందరూ ఇంటి బాట పట్టారు.

ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ ప్రజలను హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.
కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువుగా ఉన్న నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉండాలని ప్రజలను హెచ్చరిస్తూ ఒక పోస్ట్ పెట్టాడు.

ఈ సమయంలో ప్రజలు ఇంట్లో నుండి బయటకు రావడం మంచిది కాదు.నేను కూడా ఇంట్లోనే ఉంటున్న అంటూ ఒక ఫోటో కూడా షేర్ చేసాడు.ఇప్పటికే మెగా కుటుంబంలో ఆరుగురికి పైగా కరోనా వచ్చింది.అందుకే షూటింగ్స్ ఆపేసి అందరు ఇంట్లోనే కుటుంబంతో కలిసి గడుపుతున్నారు.

ప్రస్తుతం వరుణ్ తేజ్ ఎఫ్ 3 సినిమా, ఘని సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.ఎఫ్ 3 సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇది F2 సీక్వెల్ గా వస్తుంది.ఈ సినిమాలో వరుణ్ తేజ్ తో పాటు విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నాడు.ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఆగస్టు 27 వ విడుదల కాబోతుంది.

ఇక ఘని సినిమా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు.ఇందులో సయీ మంజ్రేకర్ వరుణ్ తేజ్ కు జోడీగా కనిపించబోతుంది.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ఆగిపోయింది.పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ సినిమాను వీలైనంత వరకు పూర్తి చేసి వచ్చే వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube