మెగా హీరో వరుణ్ తేజ్ ‘ముకుందా’ చిత్రంతో పరిచయం అయిన విషయం తెల్సిందే.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రంతో వరుణ్ తేజ్కు మంచి గుర్తింపు వచ్చింది.
ఆ సినిమా సక్సెస్ కాకున్నా కూడా మంచి పేరు అయితే వచ్చింది.ఆ సినిమా తర్వాత వరుణ్ తేజ్ వెనక్కు తిరిగి చూడకుండా వరుసగా చిత్రాలు చేస్తూ వస్తున్నాడు.
ప్రస్తుతం క్రేజీ హీరోగా టాలీవుడ్లో నిలిచాడు.ఈ సమయంలో మళ్లీ ముకుందా సినిమా సీక్వెల్ చేసేందుకు వరుణ్ రెడీ అయినట్లుగా సమాచారం అందుతోంది.
ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ‘నారప్ప’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.వెంకటేష్ హీరోగా రూపొందుతున్న నారప్ప షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది.
బ్యాలన్స్ షూట్ను లాక్డౌన్ ఎత్తివేసిన వెంటనే పూర్తి చేయనున్నారు.ఆ తర్వాత వరుణ్ తేజ్తో సినిమాను చేయాలని శ్రీకాంత్ అడ్డాల భావిస్తున్నాడు.
ఈ లాక్డౌన్ టైంలో వరుణ్ తేజ్ కోసం స్క్రిప్ట్ను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈసారి కమర్షియల్ ఎలిమెంట్స్తో ఒక విభిన్నమైన ప్రేమకథను వరుణ్ తేజ్ కోసం రెడీ చేస్తున్నట్లుగా శ్రీకాంత్ అడ్డాల సన్నిహితులు చెబుతున్నారు.త్వరలోనే ఈ సినిమాపై అధికారికంగా క్లారిటీ వస్తుందని అంతా ఆశిస్తున్నారు.అయితే ఇది ముకుందాకు సీక్వెల్గా ఉంటుందా లేదంటే కొత్తగా ఉంటుందా అనేది చూడాలి.
ముకుందా సినిమాకు సీక్వెల్కు స్కోప్ ఉందని గతంలో శ్రీకాంత్ అడ్డాల అన్నాడు.కనుక సీక్వెల్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.