మెగా హీరో వరుణ్ తేజ్ 9వ సినిమా గద్దలకొండ గణేష్ అలియాస్ వాల్మీకి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఆ సినిమాతో వరుణ్ తేజ్ కెరీర్ మరింత దూకుడుగా మారింది.
ఆ సినిమాలో నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో వరుణ్ నటించి మెప్పించాడు.దాంతో ఆయనకు మరిన్ని మంచి పాత్రలు వస్తున్నాయి.
వాల్మీకి చేసే సమయంలోనే అల్లు బాబీ నిర్మాణంలో కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు ఒప్పుకున్నాడు.
ఆరు నెలల క్రితమే కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మూవీ కన్ఫర్మ్ అయ్యింది.
కాని ఏదో కారణం వల్ల సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్గా కనిపించబోతున్నాడు.
బాక్సింగ్ కోచింగ్ కోసం అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్ ఛాంపియన్ వద్ద కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు.ఎప్పుడెప్పుడు సినిమా మొదలు పెడదామా అంటూ వరుణ్ చాలా ఆతృతగా ఉన్నాడు.
కాని చిత్ర నిర్మాత మరియు దర్శకుడు మాత్రం ఆలస్యం చేస్తూ ఉన్నారట.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు మరియు నిర్మాతలు ఈ చిత్రం కోసం కియారా అద్వానీని హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తున్నారు.కాని ఆమె డేట్లు మూడు నెలల వరకు ఖాళీ లేవట.ఆ తర్వాత డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పిందట.
అప్పటి వరకు వెయిట్ చేసి మూడు నెలల తర్వాత సినిమాను ప్రారంభించాలని నిర్మాత భావిస్తుంటే వరుణ్ మాత్రం ఆమె కోసం ఆగాల్సిన అవసరం నాకు లేదు అంటూ తేల్చి చెప్పాడట.హీరోయిన్ను మార్చండి లేదంటే నేను మరో కథకు ఓకే చెప్పి సినిమా చేస్తాను.
ఆ తర్వాత ఈ సినిమా చేద్దాం అంటూ నిర్మాత బాబీకి సూచించాడట.దాంతో నిర్మాత మరియు దర్శకుడు ఆలోచనల్లో పడ్డట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.