మెగా హీరో వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న కారు ఇటీవలే యాక్సిడెంట్కు గురైన విషయం తెల్సిందే.యాక్సిడెంట్ కారణంగా మెగా ఫ్యాన్స్ మరియు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
తనకు ఎలాంటి గాయం అయితే కాలేదు అంటూ క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్ యాక్సిడెంట్కు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెళ్లడించలేదు.యాక్సిడెంట్ గురించి మెగా ఫ్యాన్స్ అంతా ఆందోళన చెందుతున్న సమయంలో వరుణ్ మాత్రం తాపీగా షూటింగ్లో పాల్గొంటున్నాడు.
యాక్సిడెంట్ అయిన తెల్లారే వరుణ్ తేజ్ షూటింగ్లో పాల్గొన్నాడు.ఆ విషయాన్ని మరెవ్వరో చెబితే నమ్మేవాళ్లం కాదు.స్వయంగా వరుణ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న వాల్మీకి సినిమాకు దర్శకత్వం వహిస్తున్న హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు.తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండ చిత్రం రీమేక్గా వాల్మీకి రూపొందుతుంది.
ఈ చిత్రం షూటింగ్కు వెళ్తున్న సమయంలోనే వరుణ్ తేజ్కు యాక్సిడెంట్ అయ్యింది.
వరుణ్ తేజ్ షూటింగ్లో పాల్గొనడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.యాక్సిడెంట్కు గురైనా కూడా వెంటనే వరుణ్ తేజ్ షెడ్యూల్ క్యాన్సిల్ కాకుండా ఉద్దేశ్యంతో షూటింగ్లో పాల్గొన్నాడు.కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చేయమంటూ కోరినా కూడా నిరాకరించాడట.
దాంతో షూటింగ్ స్పాట్కు వరుణ్ తేజ్ తల్లిదండ్రులు వెళ్లి కలిసినట్లుగా తెలుస్తోంది.వరుణ్ తేజ్ వర్క్ డెడికేషన్ చూసి సన్నిహితులు హ్యాట్సాప్ అంటున్నారు.