విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన తాజా చిత్రం ఎఫ్ 3.ఈ సినిమా మే 27న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇందులో తమన్నా, మెహరిన్ లతోపాటు సోనాల్ చౌహాన్ కూడా కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.ఇప్పటికీ ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా హీరో వరుణ్ తేజ్ మీడియాతో ముచ్చటించారు.ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.
ఎఫ్ 3 సినిమా నవ్వుల పండగలా ఉంటుందని,సినిమా అంతా నవ్వుతూనే ఉంటారని చెప్పు కొచ్చారు.అంతేకాకుండా ఫ్యామిలీ అంతా కలసి మళ్ళీ మళ్ళీ ఈ సినిమాను చూస్తారు అని తెలిపాడు వరుణ్ తేజ్.
ఎఫ్ 2 సక్సెస్తో ఎఫ్ 3 భాద్యత పెరుగుతుంది కదా.మీకు ఎలా అనిపించింది? అని అడగగా.ఖచ్చితంగా బాధ్యత ఉంటుందని, ఆ భాద్యత అంతా కూడా దర్శకుడు అనిల్ రావిపూడి తీసుకున్నారు అని తెలిపాడు వరుణ్.అంతే కాకుండా తనకు అనిల్ గారిపై నమ్మకం ఎక్కువని,ఎఫ్ 2 షూటింగ్ సమయంలోనే ఎఫ్ 3చేయాలని నిర్ణయించుకున్నారు అని తెలిపాడు వరుణ్ తేజ్.
ఎఫ్ 2 సినిమాకి మించిన ట్రిపుల్ ఫన్ డోస్ ఎఫ్ 3 సినిమలో ఉంటుందని ధీమా వ్యక్తం చేసాడు వరుణ్.ఎఫ్ 3 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ నుండి ఎటువంటి రియాక్షన్స్ వచ్చింది అని అడగగా.
మొదట ట్రైలర్ ను తన తండ్రికి పంపించి.ఆ తర్వాత తేజుతో పాటు మా కజిన్స్ అందరితో కలసి చూశాము.అందరూ గట్టిగా నవ్వుకున్నారు.ఆ పాత్రలో నన్ను చూసి షాక్ అయ్యి ఏంటి ఇలా పిచ్చోడిలా చేస్తున్నావ్ అని సర్ప్రైజ్ అయ్యారు అని చెప్పు కొచ్చాడు వరుణ్ తేజ్.
అయితే నిజానికి తాను ఇంట్లో చాలా రిజర్వ్డ్ గా ఉంటానని,తనను నత్తి మ్యానరిజంలో చూసి షాక్ అయ్యారని,హీరో రామ్ చరణ్ ఫోన్ చేసి చాలా బాగా చేశావ్ అని మెచ్చుకున్నారని ఫ్యామిలీ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేసారు అని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.