కోటి ఆశలతో ఎంతో మంది 2020 సంవత్సరం కోసం ఎదురు చూశారు.నిరాశతో ఉన్న వారు కూడా 2020 సంవత్సరంలో ఏదైనా అద్బుతం జరిగి కెరీర్ లో సక్సెస్ అవుతామని ఎదురు చూసిన వారికి ఈ సంవత్సరం కన్నీటిని మిగిల్చిందని చెప్పుకోవచ్చు.
సినిమా పరిశ్రమకు కూడా ఈ ఏడాది రక్త కన్నీరునే మిగిల్చింది.ఎన్నో సినిమాలు ఈ ఏడాదిలో వచ్చి రికార్డులు బద్దలు కొట్టాలని ఆశ పడ్డాయి.
కొత్త హీరోలు ఈ ఏడాదిలో కుమ్మేయాలనుకున్నారు.కాని అందరి ప్లాన్స్ తారుమారు అయ్యాయి.
ఈ సంవత్సరం ముందుకు సాగుతున్నట్లుగానే అనిపించినా కూడా ఈ ఏడాదిలో ఏం జరగడం లేదు అనే అర్థం వచ్చేట్లుగా మెగా హీరో వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.ఇప్పటి వరకు ఈ ఏడాదిలో ఏం జరిగిందో వెనక్కు తిరిగి చూసుకుంటే మొత్తం బ్లర్గా కనిపిస్తుంది అంటూ వరుణ్ తేజ్ పేర్కొన్నాడు.
ఈ ఏడాదిలో చేసుకున్న ప్లాన్స్ మరియు పెట్టుకున్న టార్గెట్స్ అన్ని కూడా బ్లర్ అయ్యాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టాడు.
గత ఏడాది గద్దలకొండ గణేష్ చిత్రంతో సూపర్ హిట్ దక్కించుకున్న వరుణ్ తేజ్ ఈ ఏడాది బాక్సింగ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ దక్కించుకోవాలనుకున్నాడు.ఆ సినిమాతో పాటు మరో సినిమాకు కూడా కమిట్ అయ్యి వచ్చే ఏడాది ఆరంభంలోనే ఆ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్నాడు.కాని ఇప్పటి వరకు ఈ బాక్సింగ్ సినిమానే తెమలడం లేదు.
ఈ ఏడాదిలో బాక్సింగ్ సినిమా రావడం సాధ్యం అయ్యే పని కాదు.కనుక ఈ ఏడాది మొత్తం వరుణ్ తేజ్ కు బ్లర్ అన్నట్లే.