తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహిళా దర్శకురాలిగా ఇప్పటివరకు కేవలం నందినీరెడ్డి మాత్రమే ఉన్నారు.నందినిరెడ్డి పలు విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన పలు ఫ్లాపులను కూడా చవి చూశారు.
ఇలా మహిళా దర్శకురాలిగా ఉన్న నందిని రెడ్డి బాటలోనే మరో మహిళా దర్శకురాలు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.నాగ శౌర్య, రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వరుడు కావలెను.
ఈ సినిమా ద్వారా లక్ష్మీ సౌజన్య తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు.
ఈ సినిమా అక్టోబర్ 29 వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి.
ఈ క్రమంలోనే లక్ష్మీ సౌజన్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా సినిమా గురించి మాట్లాడుతూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయినీ ప్రేమించాలంటే అబ్బాయిలు ఎన్నో క్వాలిటీస్ ఉండాలి.
అలాంటి క్వాలిటీస్ నాగశౌర్యలో ఉన్నాయనీ ఈ సందర్భంగా లక్ష్మీ సౌజన్య పేర్కొన్నారు.
మనుషులందరి శరీరంలో బాడీ పార్ట్స్ అన్ని ఒకే విధంగా ఉన్నప్పటికీ వాటి మధ్య చిన్నచిన్న పోలికలు ఉంటాయి.
అలాగే సినిమాలన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి అనిపించినప్పటికీ అందుకు సంబంధించిన రిలేషన్స్, ఎమోషన్స్ అన్నీ ఎప్పుడూ ఒకే విధంగా ఉండవని అవి సినిమాకు కొత్తదనాన్ని తెస్తాయని ఈ సందర్భంగా లక్ష్మి సౌజన్య పేర్కొన్నారు.ఇందులో నాగ శౌర్య రీతువర్మ భూమి ఆకాష్ పాత్రలో కనిపించనున్నారు.
వీరి పేర్లకు అనుగుణంగానే వీరి పాత్ర ఉంటుందని ఈ సందర్భంగా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య తెలియజేశారు.