తెలుగు బుల్లితెర మీద ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈ టీవీలో ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ షోలో కెవ్వు కార్తిక్ టీమ్ లో పని చేస్తున్నటువంటి వర్ష మరియు ఇమాన్యుయెల్ ల జంట ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది.
అయితే తాజాగా షో నిర్వాహకులు వచ్చే వారం ప్రసారమయ్యేటువంటి ఎపిసోడ్ ప్రోమో ని ఇటీవలే యూట్యూబ్లో విడుదల చేశారు. అయితే ఈ ప్రోమోలో వర్ష స్కిట్ లో భాగంగా మన ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోయిందని ఇమాన్యుల్ తో చెబుతుంది.
అంతేగాక తనకి రాత్రి సమయంలో గుండెలో చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చిందని దీంతో తన తల్లిదండ్రుల చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లడంతో స్కానింగ్ చేశారని దాంతో తన హార్ట్ లో ఉన్నటువంటి ఇమాన్యుయెల్ ఫోటోని స్కానింగ్ ద్వారా గుర్తించారని చెబుతూ ఒక్కసారిగా అందరినీ నవ్వించింది.ఆ తర్వాత ఏమైందో ఏమో గాని వర్ష కెవ్వు కార్తిక్ ని పెళ్లి చేసుకుంటుంది.
దీంతో ఇమాన్యుయెల్ ఒక్కసారిగా వర్ష మరియు కెవ్వు కార్తీక్ లపై సీరియస్ అవుతాడు. ఆ తర్వాత సింగర్ మరియు జడ్జి మనోజ్ ఏకంగా రష్మీ గొంతు ఇష్టమంటూ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం ఈ ప్రోమో కే హైలెట్ అయ్యింది.
అయితే ఈ ప్రోమో గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే వచ్చే శుక్రవారం వరకు ఆగాల్సిందే.
అయితే ఈ ప్రోమోలో వర్ష మరియు ఇమాన్యుయెల్ పర్ఫార్మెన్స్ ని చూసిన కొందరు నెటిజన్లు బుల్లి తెరపై వర్ష ఇమాన్యుయెల్ ల జంట సుధీర్ రష్మి గౌతమ్ ల జంట మాదిరిగా అలరిస్తుందని వీరిద్దరికీ మంచి భవిష్యత్తు ఉందని అంటూ కామెంట్లు చేస్తున్నారు.దీనికితోడు గత ఎపిసోడ్ లో వర్ష ఇమాన్యుయెల్ గురించి స్పందిస్తూ ఇమాన్యుయెల్చాలా మంచివాడని ఇంత మంచి మనసున్న వ్యక్తి తనకి స్నేహితుడిగా దొరకడం చాల సంతోషంగా ఉందని తెలిపింది.దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.