సుధీర్ రష్మీ జోడీ తర్వాత ఆ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న జోడీగా వర్ష ఇమ్మాన్యుయేల్ జోడీ పేరు తెచ్చుకుంది.అయితే వర్ష ఇమ్మాన్యుయేల్ కేవలం షోలలో మాత్రమే నటిస్తున్నారని వాళ్లిద్దరి మధ్య ఏమీ లేదని వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా రిలీజైన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలో వర్ష స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు.ఇమ్మాన్యుయేల్ పై ఉన్న ప్రేమను వర్ష స్టేజ్ పైనే వెల్లడించడం గమనార్హం.
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనతో వర్ష ఆలోచనతో వర్ష మొదట మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.ఆ తర్వాత నటించే అవకాశాన్ని వర్ష సొంతం చేసుకున్నారు.నటించిన సీరియళ్లలో కొన్ని సీరియళ్లు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.హైపర్ ఆది ఒక స్కిట్ కోసం వర్షను జబర్దస్త్ షోలోకి తీసుకొని రాగా కామెడీ పంచ్ లను తనదైన శైలిలో పేల్చి వర్ష అవకాశాలను అందిపుచ్చుకోవడం జరిగింది.
ఆ తరువాత వేరే టీమ్ లలో కూడా అవకాశాలు రావడంతో వర్ష జబర్దస్త్ షోకు పూర్తిగా పరిమితమయ్యారు.ఇమ్మాన్యుయేల్ తో లవ్ స్టోరీ ద్వారా వర్ష పాపులారిటీని సంపాదించుకున్నారు.తాజాగా రిలీజైన ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రోమోలో ఇమ్మాన్యుయేల్ వర్షను పెళ్లి చేసుకున్నట్టు చూపించారు.అయితే స్కిట్ లో ఇమ్మాన్యుయేల్ కు పెళ్లి కావడం వర్ష ఏడ్చారు.
వర్షను చూసి రోజా నిజంగా ఇమ్మాన్యుయేల్ కు పెళ్లైతే ఏం చేస్తావని ప్రశ్నించారు.
ఆ ప్రశ్న విన్న వెంటనే వర్ష ప్రతి అమ్మాయి తాను ఇష్టపడిన వ్యక్తితో జీవితాంతం ఉండాలని అనుకుంటుందని వర్ష చెప్పుకొచ్చారు.అయితే మన ప్లేస్ లో ఇతరులు ఉంటే కష్టమని వర్ష వెల్లడించారు.ఇమ్మాన్యుయేల్ కూడా షోలో కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం.
ప్రస్తుతం వర్ష ఏడ్చిన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.