ఈ మధ్య కాలంలో ఈటీవీ ఛానెల్ లో పండుగ సమయాల్లో, ప్రత్యేకమైన రోజుల్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.డిసెంబర్ 31వ తేదీన రాత్రి డీజే ప్రోగ్రామ్ ను ఈటీవీ ప్రసారం చేయగా ఆ ప్రోగ్రామ్ ప్రేక్షకులను అలరించింది.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఈటీవీ మరో స్పెషల్ ప్రోగ్రామ్ ను అతో అత్త్మమ కూతురో పేరుతో ప్రసారం చేయనుంది.ఈ ప్రోగ్రామ్ లో రోజా అత్తగా
ప్రదీప్
మేనల్లుడిగా ఆది అనసూయ, రోహిణి రామ్ ప్రసాద్, వర్ష ఇమ్మాన్యుయేల్ కూతుళ్లుఅల్లుళ్లుగా కనిపించనున్నారు.
గత కొన్ని నెలలుగా జబర్దస్త్ షోలో స్కిట్ల ద్వారా అలరిస్తున్న ఇమ్మాన్యుయేల్ వర్ష జంట ఈ ప్రోగ్రామ్ లో మన్మధ సినిమాలోని మన్మధుడా నే కలగన్నా పాటకు డ్యాన్స్ చేశారు.అత్తో అత్తమ్మ కూతురు ప్రోగ్రామ్ ప్రోమోలో వీళ్లిద్దరి డ్యాన్స్ హైలెట్ అయింది.
గతంలో జబర్దస్త్ స్కిట్ లో రోజా వర్షను ఇమ్మాన్యుయేల్ అంటే ఇష్టమా.? అతను అందంగా లేడు కదా.? అని ప్రశ్నించగా వర్ష అందం ముఖ్యం కాదని ఇమ్మాన్యుయేల్ రెస్పెక్ట్ బాగా ఇస్తాడని చెప్పారు.
తాజాగా విడుదలైన అత్తో అత్త్మమ్మ కూతురు ప్రోమోలో రోజా వర్షను ఇమ్మాన్యుయేల్ నీకు నిజంగా మన్మథుడిలా కనిపిస్తున్నాడా.? అని ప్రశ్నిస్తుంది.ఆ ప్రశ్నకు వర్ష తనకు ఇమ్మాన్యుయేల్ నిజంగానే మన్మథుడిలా కనిపిస్తున్నాడంటూ చెప్పుకొచ్చారు.
ఇమ్మాన్యుయేల్ వర్ష కలిసి చేస్తున్న స్కిట్లు సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఏదిఏమైనా రష్మి సుధీర్, హైపర్ ఆది వర్షిణి జోడీల్లా వర్ష ఇమ్మాన్యుయేల్ జోడీ కూడా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది.ప్రోమోలో ఆది అనసూయ ఒకరిపై ఒకరు వేసుకున్న పంచ్ లు కూడా బాగున్నాయి.
సంక్రాంతి పండుగ రోజున ఈ ప్రోగ్రామ్ ప్రసారం కానుంది.