వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్గా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం గందరగోళ పరిస్థితుల నడుమ విడుదల అయ్యింది.
తెలంగాణలో ఇప్పటికే విడుదల అయిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తాజాగా ఏపీలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు మొదలు అయ్యాయి.త్వరలోనే ఏపీలో పెద్ద ఎత్తున విడుదల చేయాలని భావించిన రామ్ గోపాల్ వర్మ విజయవాడలో ప్రెస్మీట్కు ఏర్పాటు చేశాడు.
అయితే అనూహ్యంగా తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు మరియు పోలీసులు అడ్డుకున్నారు.
ఏపీ ప్రభుత్వం నుండి విజయవాడలో ప్రెస్మీట్కు అనుమతి రాకపోవడంతో రోడ్డు మీదే ప్రెస్ మీట్ను నిర్వహించాలని భావించాడు.
అయితే ప్రెస్ మీట్కు అనుమతి లేదు అంటూ వర్మ ను విజయవాడలో బలవంతంగా హైదరాబాద్ విమానం ఎక్కించారు.దాంతో తన ఈగో హర్ట్ అయ్యిందని వర్మ చెబుతున్నాడు.
ప్రజాస్వామ్య బద్దంగా నడుచుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఈ విషయాన్ని అంత తేలికగా వదలను అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక ఇదే సమయంలో రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.తాను త్వరలోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ 2 చిత్రాన్ని చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.
ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్దం అయ్యిందని అన్నాడు.లక్ష్మీ పార్వతిని చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు అనేది రెండవ పార్ట్లో ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.
చంద్రబాబు నాయుడు పాత్రను రెండవ పార్ట్లో హైలైట్ చేయబోతున్నాడట.మొదటి పార్ట్లోనే బాబును విలన్గా చూపించిన వర్మ రెండవ పార్ట్లో మరింతగా విలనిజంతో చూపించబోతున్నాడట.