వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వివాదాస్పద చిత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు.ఈ చిత్రం రెండు ప్రాంతాలు మరియు రెండు వర్గాల మద్య చిచ్చు పెట్టే విధంగా ఉంది అంటూ యువ మోర్చా నాయకులు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేయడం జరిగింది.
సినిమా టైటిల్ మార్చడంతో పాటు వివాదాస్పద సన్నివేశాలను తీయాలంటూ విజ్ఞప్తి చేశారు.ఈ సమయంలోనే ఒక టీవీ ఛానెల్ చర్చ కార్యక్రమంలో వర్మ మరియు యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు.
చర్చ కార్యక్రమంలో యువ మోర్చా నాయకుడు రమేష్ చాలా సీరియస్గా మాట్లాడుతూ వర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సమయంలో వర్మ మాత్రం చాలా కూల్గా శ్రీదేవి నటించిన ఒక తెలుగు సినిమా పాటను చిన్నగా పాడుతూ కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాడు.వర్మ తీరు ఎలా ఉందంటే ఎవరు ఏం అనుకుంటే నాకేంటి నా ఇష్టం వచ్చింది చేసుకుంటాను అన్నట్లుగా ఆయన తీరు ఉంది.
ఆయన వ్యవహరణ శైలికి అంతా అవాక్కయ్యారు.
రమేష్ అంతగా గొంతు చించుకుని విమర్శిస్తుంటే వర్మ పాట పాడటంపై యాంకర్ ప్రశ్నించగా నాతోనే ఆయన మాట్లాడేది అంటూ కామెంట్ చేశాడట.ఇక రమేష్ మాటలకు ఒకే సమాధానంను వర్మ ఇచ్చాడు.నా ఇష్టం వచ్చింది నేను తీస్తాను, నిన్ను చూడమని నేను చెప్పడం లేదు.
నీవు చూడాల్సిన అవసరం లేదు.నా సినిమా నా ఇష్టం అంటూ తేల్చి చెప్పాడు.
వర్మ మాటలకు యువ మోర్చా నాయకుడు రమేష్ నోరు మెదపలేక పోయాడు.