ఏపీలో ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న సమయంలో ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి … ఆ పార్టీలోకి జంపింగ్ చేసే వారు ఎక్కువయిపోతున్నారు.టీడీపీ ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసుకుని కీలక నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తుంటే… ప్రస్తుతం టీడీపీ నుంచి వైసీపీలోకి వలసవెళ్లే నాయకులు పెరిగిపోతున్నారు.
ఇటీవల ఏపీ మంత్రి సోమిరెడ్డి బావ రామకోటా రెడ్డి వైసీపీలో చేరగా, వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి బావమరిది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.ఇక టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
తాజాగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నం కూడా వైసీపీలో చేరతారని ప్రచారం సాగుతోంది.దీనికి బలాన్ని చేకూర్చేవిధంగా ఇవాళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వర్ల రత్నం సమావేశం కాబోతున్నట్టు తెలుస్తోంది.గతంలో కృష్ణాజిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు రత్నం.వర్ల రత్నం టీడీపీని ఎందుకు వీడాలనుకుంటున్నారు? ఆయనకు వైసీపీ నేతల నుంచి ఎలాంటి హామీ లభించింది? అన్న విషయాలపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.