తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు.బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి విచారణ పై తీవ్ర స్థాయిలో అనేక ఆరోపణలు చేశారు.
టీడీపి అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి అసలు ముద్దాయిని పట్టుకుంటామని పేర్కొన్నారు.
సీఎం గారూ, మీ బాబాయిని హత్య చేసిన హంతకులను సీబీఐ ఇంకా పట్టుకోలేదని బాధ పడుతున్నారా? ఇప్పటి సీబీఐ అసలు ముద్దాయిలను పట్టుకొని మిమ్ము సంతోష పెట్టలేకపోతే.కచ్చితంగా నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తాం, అప్పుడు తప్పకుండా మీ బాబాయిని నరికి చంపిన అసలు ముద్దాయిలను పట్టుకుంటాం, వాస్తవాలు ప్రజల ముందుంచుతాం.ఓకేనా అంటూ వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
మరి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. సరిగ్గా 2019 ఎన్నికల ప్రచారానికి ముందు జరిగిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.
విషయంలో ఇప్పటివరకు ఓ కొలిక్కి రాకపోవడంపై.అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా గానీ ఈ కేసుకు సంబంధించి ముద్దాయిలు దొరకక పోవటం పట్ల.విపక్షాలు నుండి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి
.