అసలు వైకాపా పార్టీ కి టైమ్ కలసి రావడం లేదు.అసలే అధికారం పోయి అధినేత ఏడుస్తుంటే.
మరో పక్క ఆ పార్టీలో కష్టపడి గెలిచిన నేతలు సైతం అనేక ఇబ్బందులు పడుతున్నారు.ఈ మధ్యనే ఒక వైకాపా ఎం.ఎల్.ఏ కూతురు డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ లో పట్టుబడి ఆమె పరువును నడి రోడ్డులో నిలువునా తీసేసింది.ఇది మార్చిపోతున్న క్రమంలో అదే ఎం.ఎల్.ఏ కు భర్త నుంచి ఇబ్బందులు తప్పడం లేదు.ఆమె ఎవరో కాదు.
కృష్ణా జిల్లా పామర్రు నుంచి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన ఉప్పలేటి కల్పన.అసలు విషయం ఏమిటంటే.
గత ఎన్నికల సందర్భంగా ఈమె తరపున భర్త ప్రచారం చేయడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.అదేంటి భర్త కూడా ప్రచారం చేయకూడదా అని ఆశ్చర్యపోకండి.
ఆయన అల్లాటప్పా ఆయన కాదు.ఐఆర్ఎస్ అధికారి.
పేరు దేవీ ప్రసాద్.ఇన్ కం టాక్స్ ఆఫీసరు.
సివిల్ సర్వీసు అధికారి అయ్యుండి ఎన్నికల ప్రచారం చేసి.రూల్సు అతిక్రమించారని వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు.
కలెక్టర్ కూ ఫిర్యాదు చేశారు.అంతటితో ఆగకుండా కోర్టుకూ వెళ్లారు.
హైకోర్టు విచారించి వైసీపీ ఎమ్మెల్యే భర్తపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని తీర్పు ఇఛ్చిందని వర్ల రామయ్య చెబుతున్నారు.ఇప్పటికైనా.
దేవీప్రసాద్ పై కేంద్రం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఇక అదే క్రమంలో ఆమె కూడా ఎం.ఎల్.ఏ గా రాజీనామా చెయ్యాలి అని సైతం వర్ల రామయ్య డిమాండ్ చేస్తున్నారు.