చేనేతకారుడి వస్త్రంలో రామయ్య ధనస్సు!

అయోధ్యలో శ్రీ రామమందిరం..

 Varanasi Weaver, Clothes, Jai Shree Ram, Pm Modi-TeluguStop.com

ఎన్నో కోట్లమంది హిందువుల కల ఇది.ఇంకా ఈ కలకు ఆగష్టు 5 వ తేదీన శ్రీకారం చుట్టనుంది మోడీ ప్రభుత్వం.ఆగస్టు 5న శ్రీ రామమందిరం నిర్మాణ భూమి పూజ చేయనున్నారు .ప్రధాని నరేంద్ర మోడీనే భూమి పూజ చేయనున్నారు.దీంతో మోడీ కోసం వారణాసిలోని బచ్చేలాల్ అనే నేత కార్మికుడు ప్రత్యేక వస్త్రాన్ని నేశారు.

ఆ వస్త్రంపై ”జై శ్రీ రామ్, అయోధ్య పవిత్ర థామ్” అని ఎంబ్రాయిడరీ చేశారు.

ఆ వస్త్రం ఎంత ప్రత్యేకమైనది.ఎంత అద్భుతం అనేది బచ్చేలాల్ వివరిస్తూ.

మెటిరీయల్, డిజైన్ ఈ వస్త్రం గొప్పతనమని, దీనిపై జైశ్రీమ్, అయోధ్య పవిత్ర థామ్ అని రాసి ఉంటుందని బచ్చేలాల్ తెలిపారు.

అంతేకాదు ఈ వస్త్రంపై శ్రీరాముడి ధనుస్సు కూడా ఉందని.

కాటన్, సిల్క్ దారాలతో ఈ క్లాత్ తయారు చేసినట్టు, ఇంకా వస్త్రం తయారీకి 15 రోజులు పట్టిందని బచ్చేలాల్ తెలిపారు.కాగా ఈ వస్త్రంలో బంగారు, ఎరుపు రంగు వాడినట్టు వస్త్రం పొడవు 72 అంగుళాలు, వెడల్పు 22 అంగుళాలతో తయారు చేసినట్టు తెలిపారు.

కాగా ఈ వస్త్రాన్ని పోలీస్ కమిషనర్ ద్వారా అయోధ్యకు పంపాలని అనుకుంటున్నట్టు అతను తెలిపారు.కాగా అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుండటం ఎంతో ఆనందంగా ఉందని, ఈ నిర్మాణంతో వారి వ్యాపారం కూడా బాగా పెరుగుతుందని బచ్చేలాల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

కాగా అయోధ్య భూమి పూజకు ఎక్కడెక్కడ నుండో భక్తులు వస్తున్న సంగతి విదితమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube