తమిళంలో హీరోయిన్ గా పరిచయం అయిన వరలక్ష్మి శరత్ కుమార్ వరుసగా విలక్షణ సినిమాలు చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.హీరోయిన్ గానే కాకుండా వరుసగా విలన్ పాత్రల్లో కూడా నటిస్తున్న వరలక్ష్మి ఈమద్య వరుసగా తెలుగు సినిమాలు చేస్తోంది.
తెలుగు లో ఈమె చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ మంచి విజయాలు సాధిస్తున్నాయి.క్రాక్ సినిమా లో వరలక్ష్మి చేసిన జయమ్మ పాత్ర సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అందుకే వరుసగా ఆమెను తెలుగులో బుక్ చేసేందుకు నిర్మాతలు మరియు దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు.భారీ ఎత్తున అంచనాలున్న సినిమా ల్లో ఈమెను కీలక పాత్ర కోసం తీసుకోవడంతో పాటు పెద్ద పాత్ర కు ఆమెను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
అల్లరి నరేష్ హీరోగా నటించిన నాంది సినిమా లో వరలక్ష్మి మరో మంచి పాత్రను చేసింది.సినిమా విజయంలో ఈమె మరోసారి కీలక పాత్రను పోషించింది అనడంలో సందేహం లేదు.
వరలక్ష్మి కీలక పాత్రలో నటించిన నాంది సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.కనుక వరలక్ష్మి మళ్లీ తెలుగు లో మరిన్ని ఆఫర్లు దక్కించుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగులో ఈమె చేస్తున్న ఇతర సినిమాలు కూడా ఈమెకు మరింతగా క్రేజ్ ను తెచ్చి పెడుతాయని ఇండస్ట్రీ వర్గాల వార వారు అంటున్నారు.తెలుగులో ఈమె చేస్తున్న సినిమాలు వరుసగా విజయాలు సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో పారితోషికం విషయంలో కూడా ఈ అమ్మడు భారీగా దక్కించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
తమిళంలో కూడా ఈమె వరుసగా సినిమాల్లో నటిస్తూ వస్తుంది.ఈమె ఎప్పుడో హీరోయిన్ గా నటించడం మానేసింది.ఇప్పుడు మొత్తం విలన్ వేశాలతోనే కెరీర్ ను కొనసాగిస్తున్న విషయం తెల్సిందే.క్రాక్ మరియు నాంది సినిమాల్లో ఈమె పాత్రలు ఆమె రేంజ్ ను మరింతగా పెంచాయి.