హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించి, తరువాత సౌత్ లో లేడీ విలన్ అవతారం ఎత్తిన నటి వరలక్ష్మి.శరత్ కుమార్ కూతురుగా సినిమాలకి పరిచయం అయిన ఈ భామ తరువాత తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకుంది.
రెగ్యులర్ హీరోయిన్స్ కి భిన్నంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న విలనీ పాత్రలతో మెప్పించడం స్టార్ట్ చేసింది.దీంతో కోలీవుడ్ లో విశాల్, విజయ్ లాంటి స్టార్స్ కి ప్రతినాయకిగా చేసే అవకాశాన్ని సొంతం చేసుకుంది.
అలాగే ప్రస్తుతం తెలుగులో రవితేజ క్రాక్ సినిమాలో లేడీ విలన్ గా అందరగొట్టడానికి రెడీ అయ్యింది.ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకుంది.
నటిగా ప్రూవ్ చేసుకొని ఇప్పుడు దర్శకురాలిగా కూడా సత్తా చాటడానికి రెడీ అవుతుంది.తాజాగా ఆమె దర్శకత్వం వహించిన సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది.
ఈమె దర్శకత్వంలో తెన్నాండాల్ ఫిలింస్ బ్యానర్పై రామస్వామి నిర్మాతగా కన్నామూచి అనే సినిమా తెరకెక్కుతుంది.మహిళా ప్రాధాన్యత ఉన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇక్కడ చాలా ధైర్యవంతురాలైన మహిళ ఉంది.మనకు వారు తెలుసు, మనలోనే వారుండొచ్చు అలాంటి వారి గురించి బలంగా చెబుతాం అంటూ ఈ సినిమా టైటిల్ పోస్టర్ను రిలీజ్ చేశారు.
ఇక ఈ పోస్టర్ ప్రత్యేకత ఏంటంటే సౌత్ లో హీరోయిన్స్ గా తెచ్చుకున్న అందాల భామలు అందరూ కూడా వారి వారి ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు.పోస్ట్ ని చేసిన వారిలో తాప్సీ, లక్ష్మీమంచు, సమంత, ఐశ్వర్యా రాజేష్, సాయిపల్లవి, రాధికా శరత్కుమార్, జ్యోతిక, కీర్తిసురేష్, మంజిమ మోహన్, కాజల్ అగర్వాల్, రెజీనా కసండ్ర, శ్రద్ధా శ్రీనాథ్, అదితిరావు హైదరి, హన్సిక, సుహాసిని, సిమ్రాన్, చిన్మయి,త్రిష, అకరా హాసన్, ఆండ్రియా, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, సయేషా సైగల్, శృతిహాసన్ తదితరులు ఉన్నారు.
పోస్టర్ షేర్ చేసి వారంతా వరలక్ష్మి శరత్ కుమార్ కి అభినందనలు తెలిపారు.