నందమూరి హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నాడు.ఈ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు.
ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ఎనౌన్స్ అయిపొయింది.దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీని నిర్మిస్తుంది.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ రిలీజ్ చేసేందుకు ఓ వైపు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.
మరో వైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ మూవీని తెరకెక్కించే పనిలో ఉన్నాడు.
ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ కోసం ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి.హైదరాబాద్ చేవెళ్ళ ప్రాంతంలో సలార్ షూటింగ్ కోసం ప్రత్యేకమైన డెన్ సెట్ వేసినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబో మూవీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తాజాగా మరో అప్డేట్ వినిపిస్తుంది.ప్రస్తుతం తమిళ్, తెలుగు బాషలలో పవర్ ఫుల్ లేడీ విలన్ గా దూసుకుపోతున్న వరలక్ష్మి శరత్ కుమార్ ని ఈ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి ప్రతినాయకిగా ఎంపిక చేసారనే టాక్ వినిపిస్తుంది.
గోపీచంద్ మలినేని కూడా ఇప్పటికే బాలకృష్ణ కోసం వరలక్ష్మిని విలన్ గా ఎంపిక చేసారని టాక్ వినిపిస్తుంది.ఇప్పుడు అబ్బాయ్ ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ ఆమెని ఏరికోరి మరీ ఎంపిక చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఇదే నిజమైతే సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోవడం ఖాయం అనే మాట వినిపిస్తుంది.