హీరోయిన్ సమంత మయోసిటీస్ అనే ప్రాణాంతకర వ్యాధితో బాధపడుతున్నట్లు వచ్చిన వార్త ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియాని కుదిపేస్తోంది.ఆమె త్వరగా కోలుకోవాలని ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు అభిమానులు ఆశిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో యశోద సినిమా ఇంటర్వ్యూలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ సమంత గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.నటి వరలక్ష్మి శరత్ కుమార్ అందరికీ సుపరిచితురాలే.
తమిళంలో బిజీగా ఉండే ఈ నటి ఇటీవల తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ ఉంది.ఈ క్రమంలో తాజాగా సమంత నటించిన యశోద సినిమాలో కీలక పాత్ర చేయడం జరిగింది.“యశోద” సినిమాకి సంబంధించి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ సమంత గురించి వరలక్ష్మి శరత్ కుమార్ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియజేశారు.హీరోయిన్ సమంత 12 సంవత్సరాల క్రితమే నాకు బాగా తెలుసు.మాకు చెన్నైలో ఆమె బాగా పరిచయం.“యశోద” సినిమాలో సమంత చాలా కష్టపడ్డారు.సినిమాకి కథే హీరో లాగా ఉంటుంది.దీంతో చాలా సీరియస్ గా వెరీ స్ట్రాంగ్ రోల్ లో సమంత నటించడంతో ఖాళీ సమయం దొరికినప్పుడల్లా… సమంతతో జోకులు వేసేదాన్ని.
ఎందుకంటే సినిమాలో ఆమె ఎక్కువగా సీరియస్ సన్నివేశాలలో నటించేది.దీంతో సామ్ ని ఆట పాటిస్తూ సరదాగా ఉండేదాన్ని.

అయితే ఒక్కోసారి షాట్ ముందు… ఎందుకు జోకులు వేస్తావ్ అనేది.ఏది ఏమైనా సమంతతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా సరదాగా ఉంటుంది.సమంత చాలా స్ట్రాంగ్ ఉమెన్.చాలా పవర్ ఫుల్ పాత్రలో ఇట్టే వదిగిపోయింది.ఇదే సమయంలో తెలుగులో “శబరి” సినిమాతో పాటు బాలకృష్ణ నటిస్తున్న “వీరసింహారెడ్డి” సినిమాలు చేస్తున్నట్లు వరలక్ష్మి శరత్ కుమార్ ఇంటర్వ్యూలో స్పష్టం చేయడం జరిగింది.