బుల్లితెర సీరియళ్లలో నంబర్ వన్ సీరియల్ ఏదనే ప్రశ్నకు ప్రేక్షకులు కార్తీకదీపం అని సమాధానం చెబుతారు.ఆ సీరియల్ లోని వంటలక్క డాక్టర్ బాబు పాత్రలలో ప్రేమీ విశ్వనాథ్ నిరుపమ్ పరిటాలను తప్ప ప్రేక్షకులు మరొకరిని ఊహించుకోలేరు.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రేమీ విశ్వనాథ్ కార్తీకదీపం సీరియల్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.మలయాళంతో పోలిస్తే తనకు తెలుగులోనే ఎక్కువ గుర్తింపు వచ్చిందని ప్రేమీ విశ్వనాథ్ అన్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు తనను ఆడపడుచులా భావిస్తున్నారని ఇంతలా తెలుగు ప్రేక్షకులు అభిమానించడం తన లక్ అని ఆమె అన్నారు.మలయాళంలో హిట్ అయిన కరతముత్తు సీరియల్ కార్తీకదీపం పేరుతో తెలుగులో రీమేక్ కాగా తెలుగు నేటివిటీకి తగిన విధంగా ఈ సీరియల్ లో స్వల్పంగా మార్పులు చేశారు.
కాపుగంటి రాజేంద్ర కార్తీకదీపం సీరియల్ కు దర్శకత్వం వహిస్తున్నారు.
మొదట కరతముత్తు రీమేక్ లో తాను నటించనని ప్రేమీ విశ్వనాథ్ వెల్లడించడం గమనార్హం.
తెలుగు భాష రాకపోవడం వల్ల ప్రేమీ విశ్వనాథ్ ఈ సీరియల్ లో నటించడానికి ఆసక్తి చూపలేదు.అయితే డైరెక్టర్ రాజేంద్ర మాత్రం వంటలక్క పాత్రకు ప్రేమీ విశ్వనాథ్ మాత్రమే సూట్ అవుతారని ఫోర్స్ చేయడంతో ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో సీరియల్ లో నటించడానికి అంగీకరించారు.
అయితే కార్తీకదీపం సీరియల్ లో నటించడానికి అంగీకరించినందుకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని ప్రేమీ విశ్వనాథ్ అన్నారు.ఒకవేళ ఈ సీరియల్ లో నటించడానికి అంగీకరించకపోయి ఉంటే మాత్రం ప్రేమీ విశ్వనాథ్ కు ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే వచ్చి ఉండేది కాదని చెప్పవచ్చు.ప్రస్తుతం ప్రేమీ విశ్వనాథ్ కు స్టార్ హీరోయిన్లతో సమానంగా క్రేజ్ రాగా సినిమాల్లో కూడా ప్రేమీ విశ్వనాథ్ కు ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.