త్వరలో తమిళనాడులో శాసనసభ ఎన్నికలు రాబోతున్నాయి.ఈ నేపథ్యంలో బిజేపి ఎలాగైనా ఎక్కడ అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలే చేస్తుంది.
మొదటి నుండి దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాదించాలని చూస్తున్న బిజేపి ఆ దిశగా అడుగులు వేస్తుంది.నరేంద్ర మోడి నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ది చెందుతుందనే అనే ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లుతున్నారు.
తమిళనాడులో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అక్కడి బిజేపి చేరికలపై దృష్టి పెట్టింది.అందుకు ప్రజలలో మంచి పేరు ఉన్న నాయకులను, కార్యకర్తలను, పేరు ఉన్న సినీ నటీనటులను తీసుకురావాలని యోచిస్తుంది.
ఏపీ బిజేపి కార్యాలయ బాధ్యుడు సత్యమూర్తి నిన్న తమిళనాడు రాజధాని చెన్నైలో సినీ పరిశ్రమకు చెందిన వాణి విశ్వనాథ్, ప్రియరామన్ లతో వెరు వెరు గా భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఆయన బిజేపిలోకి రావాలని ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది.
ఏపీలోని తిరుపతిలో జరగబోయే ఉప ఎన్నికలో బిజేపి తరుపున ప్రచారం చెయ్యాలని కోరినట్లుగా సమాచారం.పార్టీ అభివృద్ది కి సహకరిస్తే 2024 ఎన్నికల్లో అవకాశం కల్పిస్తాం, అండగా నిలబడతాం అని మాట ఇచ్చినట్లుగా సమాచారం.
ఏపీ బిజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు తో చర్చించిన తర్వాత వారు కాషాయ కండువ కప్పుకొనున్నారని తెలుస్తుంది .