పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
పీరియాడికల్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.ప్రభాస్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటి వరకు చాలా మంది పేర్లు వినిపించాయి.అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం మరో బాలీవుడ్ ముద్దుగుమ్మని పవన్ కళ్యాణ్ కి జోడీగా ఈ సినిమాలో క్రిష్ ఫైనల్ చేసాడని తెలుస్తుంది.
వాణీ కపూర్ అంటే బాలీవుడ్ లో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.అక్కడ యంగ్ హీరోలతో జత కట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం ఖాళీగా ఉంటుంది.
తెలుగులో నానికి జోడీగా ఆహ కళ్యాణం అనే బాలీవుడ్ రీమేక్ లో నటించింది.అయితే ఈ సినిమాలో నాని కెరియర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.
దీంతో ఈ అమ్మడుని తెలుగులో ఎవరు పట్టించుకోవడం మానేశారు.ఇప్పుడు క్రిష్ పవన్ కళ్యాణ్ కోసం వాణీ కపూర్ ని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తుంది.
త్వరలో దీనికి సంబందించిన సమాచారం అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.