అర్ధ శతాబ్దిలో అమెరికా తెలుగు కధ పేరుతో కధా సంకలనంగా కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురించనుంది.50 ఏళ్ల ఉత్తర అమెరికా కధా సాహిత్యాన్ని ఈ కధ రూపంలో వెలువరచనుంది.అందుకు గాను రచనా ,సేకరనలని ఆహ్వానిస్తోంది.రచయితలూ , పాఠకులు తాము రాసిన లేక నచ్చిన రెండు కధల్ని ఈ పోటీలో పంపాలి.
డా.వంగూరి చిట్టెన్ రాజు (వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా హ్యూస్టన్, టెక్సస్), డా.సి.మృణాళిని(హైదరాబాద్) దీనికి సంపాదకులుగా వ్యవహరిస్తారు.కథకుడి నివాసం, కథ ఇతివృత్తాల ఆధారంగా పరిశీలనకు వచ్చిన ఏ కథ అయినా అమెరికా కథా, కాదా అనే అంశంపై సంపాదకులదే తుది నిర్ణయం…అయితే కథా సంకలనంలో కథల సేకరణ, ఎంపికల బాధ్యత సంపాదకులదే.
ఏ కధ ప్రచురణ అయినా సరే 1964-2014 మధ్య కాలానిదై ఉండాలి.ప్రతి కథా ప్రచురించబడిన పత్రిక పేరు, సంవత్సరం, నెల, తేదీ వివరాలు తప్పనిసరి ఉండాలి.కథా ప్రచురణ వివరాలు, అనుమతి పత్రంతోపాటు ప్రతీ రచయితా తప్పనిసరిగా తమ పాస్పోర్ట్ సైజ్ ఫొటో, పది వాక్యాల లోపు జీవిత విశేషాలు, మొబైల్ , ఇ-మెయిల్ ఐ.డి పంపాలి.ఆఖరు తేదీ ఈనెల 31.పంపించాల్సిన చిరునామా vangurifoundation@gmail.com.ఫోన్ నంబర్: 8325949054.