హైదరాబాద్ శివారు వనస్థలిపురం వద్ద హస్తినాపురంలో పోలీస్ స్టేషన్ పరిధి దగ్గర తెల్లవారుజామున మూడు గంటలకి భారీ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం తాగి కారు నడిపిన యువకులు డైరెక్టుగా సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టడంతో.
కారు పల్టీలు కొట్టుకుంటూ మరోపక్క రోడ్డుపై దూసుకెళ్లింది.ప్రమాదం జరిగిన సమయంలో సాగర్ రోడ్డు నుండి ఇబ్రహీంపట్నం వైపుగా కార్ వెళ్తోంది.
అయితే ఆ కారులో గౌతమ్ అనే యువకుడు ఫుల్ గా మద్యం తాగి డ్రైవింగ్ చేయడం జరిగిందని .కారు పల్టీ కొట్టడంతో వెనకాల సీట్ లో కూర్చున్న సందీప్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది అట.ఈ క్రమంలో మరో యువకుడు ప్రమాదం జరిగిన వెంటనే పరారీ అవ్వగా .విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే డ్రైవింగ్ చేసిన గౌతమ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకోవడం జరిగిందట.