గత ఏడాది మహేష్బాబు 25వ చిత్రం మహర్షితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి తన తర్వాత సినిమాను కూడా మహేష్బాబుతో చేయబోతున్నట్లుగా ఇన్ని రోజులు చెప్పుకు తిరిగాడు.మహేష్బాబు కూడా తన 27వ చిత్రం బాధ్యతలను వంశీకే ఇచ్చినట్లుగా మాట్లాడాడు.
ఇద్దరు కలిసి చాలా తిరిగారు.కాని ఏమైందో ఏమో కాని మహేష్ 27వ చిత్రం దర్శకుడు మారాడు.
వంశీ చేతిలోంచి ఆ సినిమా జారి పోయింది.
మహేష్బాబును తన స్క్రిప్ట్తో సంతృప్తిపర్చలేక పోవడంతో వంశీకి ఆయన హ్యాండ్ ఇచ్చాడు.
పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను అదుగో ప్రారంభిస్తున్నారు ఇదుగో షురు చేస్తున్నారంటూ ప్రచారం చేశారు.కాని ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏదీ రాలేదు.
చివరకు సినిమా క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది.మహేష్బాబు కాదనడంతో దర్శకుడు వంశీ మరో హీరో వేటలో పడట్లుగా సమాచారం అందుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ను కథ చెప్పేందుకు టైం ఇవ్వమని వంశీ కోరినట్లుగా తెలుస్తోంది.ఆర్ఆర్ఆర్ షూటింగ్తో బిజీగా ఉన్న చరణ్ త్వరలోనే కథ వింటానని చెప్పాడు.గతంలో వీరిద్దరి కాంబోలో ఎవడు చిత్రం వచ్చింది.ఆ సినిమా సమయంలోనే వంశీతో మరో సినిమా చేయాలని చరణ్ అనుకున్నాడు.కాని కొన్ని కారణాల వల్ల సాధ్యం కాలేదు.మరి అది ఇప్పుడు సాధ్యం అవుతుందో చూడాలి.