టాలీవుడ్లో సక్సెస్ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న డైరెక్టర్ వంశీ పైడిపల్లి, మహేష్ బాబుతో మహర్షి చిత్రంతో అదిరిపోయే సక్సెస్ను అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా తరువాత ఇప్పటివరకు తన నెక్ట్స్ చిత్రాన్ని ఓకే చేయలేదు ఈ డైరెక్టర్.
నిజానికి మహర్షి చిత్రం తరువాత వెంటనే మహేష్ బాబుతో మరో సినిమా చేయాలని వంశీ అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఎందుకో కుదరలేదు.
దీంతో తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేయాలా అనే డైలమాలో పడ్డాడు వంశీ.ఈ క్రమంలోనే తన చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో తీద్దామని అనుకున్నా, ఆయన కూడా వంశీకి హ్యాండిచ్చాడు.
దీంతో వంశీ తన నెక్ట్స్ మూవీని ఎవరితో తీయాలా అనే సందిగ్ధంలో పడిపోయారు.అయితే డైరెక్టర్ వంశీ తన నెక్ట్స్ చిత్రాన్ని నేచురల్ స్టార్ నానితో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట.
ఇప్పటికే నానికి ఓ స్టోరీలైన్ వినిపించగా, అది నానికి నచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కథను డెవలప్ చేసే పనిలో పడ్డాడట వంశీ.
ఇక వీలైనంత త్వరగా ఈ సినిమా స్క్రిప్టును పూర్తి చేసి నానితో సినిమా ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు వంశీ పైడిపల్లి.మరి ఈ సారైనా వంశీ తాను అనుకున్నట్లు సినిమాను తెరకెక్కిస్తాడా లేక నాని కూడా వంశీకి హ్యాండిస్తాడా అనేది చూడాలి.
ఏదేమైనా స్టార్ హీరోల దెబ్బకు వంశీ పైడిపల్లి ఇలా నానితో సినిమా చేయాల్సిన పరిస్థితి వచ్చిందనేది మాత్రం వాస్తవం.