వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేయబోతున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ !

వంశీ పైడిపల్లి మున్నా సినిమాతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యాడు.ఈ సినిమా తర్వాత వంశీ బృందావనం, ఎవడు, మహర్షి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను డైరెక్ట్ చేసాడు.

 Vamsi Paidipally To Direct Web Series, Vamsi Paidipally, Aha, Web Series, Mahars-TeluguStop.com

ఈ సినిమాకు 100 కోట్లకు పైగా వసూలు చేసి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది.తాజాగా 67 వ జాతీయ అవార్డుల్లో 3 నేషనల్ అవార్డులు అందుకుని అందరిని ఆశ్చర్యపరిచింది.
అయితే వంశీ పైడిపల్లి మహర్షి సినిమా తర్వాత మరొక సినిమా మొదలు పెట్టలేదు.ఈయన అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.మహర్షి సూప్ హిట్ తర్వాత ఏ హీరోతో సినిమా అనౌన్స్ చేస్తాడో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.వంశీ మహర్షి సినిమా తర్వాత మహేష్ బాబుతోనే మరొక సినిమా చేయాలనీ అనుకున్నాడు.
అయితే ఈ సినిమా కొన్ని కారణాల వల్ల సెట్స్ మీదకు వెళ్ళలేదు.ఈ లోపు మహేష్ పరశురామ్ తో సర్కారు వారి పాట సినిమా మొదలు పెట్టాడు.

అయితే ఈ సినిమా ఆగిపోవడంతో తర్వాత సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీస్తున్నాడని వార్తలు వినిపించాయి.అయితే ఈ వార్తలో కూడా నిజం లేదని తేలిపోయింది.

అయితే మళ్ళీ మహేష్ తోనే సినిమా చేయబోతున్నట్టు ఈ మధ్య మరొక రూమర్ వినిపిస్తుంది.

అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం వంశీ పైడిపల్లి ఒక వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.‘ఆహా’ ఓటిటి సంస్థ కోసం ఒక వెబ్ సిరీస్ తీయడానికి వంశీ రెడీ అయినట్లు టాక్.ఈ వెబ్ సిరీస్ లో ఒక స్టార్ హీరోయిన్ కూడా నటిస్తుందని సమాచారం.

ఇంకా ఈ వెబ్ సిరీస్ గురించి ఎలాంటి వివరాలు తెలియదు.త్వరలోనే ఈ వెబ్ సిరీస్ లో నటించే నటుల వివరాలు ప్రకటించనున్నట్టు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube