అల్లు అర్జున్ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు.ఒక దాని వెంట మరోటి మొదలు పెడుతూనే ఉన్నాడు.
‘సన్నాప్ సత్యమూర్తి’ సినిమా తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ తాజాగా బోయపాటి దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పి, అందుకు సిద్దం అవుతున్నాడు.ఈ నెలలోనే అల్లు అర్జున్ బోయపాటిల కాంబినేషన్లో సినిమా ప్రారంభం కాబోతుంది.
వీరి కాంబోలో మూవీ ఈ సంవత్సరం చివర్లో పూర్తి అయ్యే అవకాశాలున్నాయి.బోయపాటితో సినిమా పూర్తి అవ్వగానే మరో సినిమాను చేసేందుకు బన్నీ అప్పుడే కమిట్ అయ్యాడు.
రామ్చరణ్ ‘ఎవడు’ సినిమాకు దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.‘ఎవడు’ సినిమాలో అల్లు అర్జున్ గెస్ట్ రోల్లో కనిపించాడు.
అప్పుడే మంచి కథ ఉంటే తప్పకుండా సినిమా చేద్దాం అంటూ వంశీకి అల్లు అర్జున్ మాట ఇచ్చాడట.తాజాగా ఒక మంచి స్టోరీ లైన్ను అల్లు అర్జున్కు వంశీ పైడి పల్లి వినిపించడం జరిగింది.
ఆ కథ బాగా నచ్చడంతో బన్నీ నటించేందుకు ఒప్పుకున్నాడు.వీరిద్దరి కాంబోలో మూవీ వచ్చే సంవత్సరంలో ప్రారంభం కానుంది.
ప్రస్తుతం నాగార్జున, కార్తీలతో వంశీ పైడిపల్లి ఒక ద్విభాష చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.