వంశీ పైడిపల్లి కెరీర్ ఆరంభించి పుష్కర కాలం అయినా కూడా ఇప్పటి వరకు అరడజను సినిమాలు కూడా చేయలేదు.ఈయన ఒక్కో సినిమాకు చాలా సమయం తీసుకుంటాడు.
ఒక స్క్రిప్ట్ అనుకున్నాడు అంటే దానితో మెప్పించేందుకు స్టార్స్ చుట్టు తిరుగుతూనే ఉంటాడు.ఆమద్య ఊపిరి సినిమా కోసం మూడు సంవత్సరాలు వెయిట్ చేశాడు.
ఎన్టీఆర్ను రంగంలోకి దించేందుకు ప్రయత్నించి విఫలం అయ్యాడు.చివరకు నాగార్జున కార్తీలతో చేశాడు.
ఊపిరి సినిమా కథను పలువురు కాదన్నా కూడా ఆయన మాత్రం పట్టువదలకుండా నాగార్జున వద్దకు తీసుకు వెళ్లి అనేక మార్పులు చేర్పులు చేసి మరీ సినిమాను చేశాడు.ఆ తర్వాత మహేష్బాబు మహర్షి విషయంలో కూడా అదే జరిగింది.
స్క్రిప్ట్కు చాలా సార్లు మార్పులు చేర్పులు చేశారు.చివరకు మహర్షిని తెరకెక్కించారు.
ఇప్పుడు మహేష్బాబుతో ఆయన సినిమా చేయాలనుకుంటున్నాడు.ఇటీవల కథ సరిగా లేదంటూ మహేష్బాబు నో చెప్పడంతో మళ్లీ మహేష్నే మెప్పించేందుకు కొత్త స్క్రిప్ట్ను తయారు చేస్తున్నాడట.
వంశీ పైడిపల్లి పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా మహేష్బాబుతో సినిమాను చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.ఈఏడాది కాకుంటే వచ్చే ఏడాది అయినా మహేష్తోనే సినిమా చేయాలని భావిస్తున్నాడు.అందుకే ఆయన వెంటే తిరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.దిల్రాజు బ్యానర్లో కాకుండా ఈసారి మరో నిర్మాత బ్యానర్లో మహేష్బాబు.వంశీ పైడిపల్లి కాంబో మూవీ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది అంటున్నారు.అయితే అది ఎప్పుడు అనేది మాత్రం తెలియడం లేదు.