వరుసగా ఊపిరి, మహర్షి లాంటి సూపర్ హిట్ చిత్రాలని అందించిన దర్శకుడుగా వంశీ పైడిపల్లి తన మార్క్ చూపించాడు.అయితే మహర్షి సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా కోసం చాలా కాలంగా ఇంకో స్టార్ హీరో కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు.
అయితే అందరూ కూడా ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో ఎవరితో కూడా సెట్ కాలేదు.దీంతో ప్రస్తుతం ఖాళీ సమయాన్ని అల్లు అరవింద్ ఆహా కోసం వెచ్చిస్తున్నారు.
ఆహా యాప్ ని మరింతగా మార్కెట్ లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్న అల్లు అరవింద్ కంటెంట్ సెలక్షన్ బాధ్యతలని పూర్తిగా వంశీ పైడిపల్లికి అప్పగించినట్లు తెలుస్తుంది.చిన్న సినిమాలని ఓటీటీ కోసం ఎంపిక చేసే బాధ్యతలు వంశీ హ్యాండిల్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ కారణంగా ఈ మధ్య కాలంలో ఆహా యాప్ లో ఎక్కువ కంటెంట్ బేస్ సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి.
ఇక మెగా కాంపౌండ్ లో వంశీ వెయిటింగ్ లో ఉండటానికి కారణం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆ హీరోలతో చేయడానికే అని తెలుస్తుంది.
ముఖ్యంగా తన నెక్స్ట్ సినిమాని రామ్ చరణ్ వంశీ పైడిపల్లి ప్లాన్ చేసినట్లు సమాచారం.ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత అధికారికంగా ఈ సినిమాని ఎనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తుంది.
ఆచార్య షూటింగ్ పూర్తి చేసిన తర్వాత వంశీ సినిమాని రామ్ చరణ్ వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని చర్చ నడుస్తుంది.ఈ కారణంగానే మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఆహా యాప్ కోసం ప్రస్తుతం వంశీ పైడిపల్లి పని చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.