వంశీ కి షాక్ ! సస్పెన్షన్ వేటు వేసిన టీడీపీ

గన్నవరం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ పై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.తెలుగుదేశం పార్టీ మీద, అధినాయకుడు చంద్రబాబు మీద పెద్ద ఎత్తున విమర్శలు చేయడంతో పాటు తమ రాజకీయ ప్రత్యర్థి సీఎం జగన్ ను కలవడంపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

 Vallbaneni Vamsi Suspended On Tdp-TeluguStop.com

అంతే కాకుండా చంద్రబాబు చేపట్టిన ఇసుక దీక్షను సైతం వంశీ అవహేళన చేయడం, వ్యక్తిగత విమర్శలు చేయడమైనా ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

తగా ఈ రోజు ఉదయం పార్టీ కీలక నాయకులతో తాజా పరిణామాలమీద చర్చించిన చంద్రబాబు వంశీ విషయంలో ఉదారంగా వ్యవహరిస్తే మరికొందరు ఇదే బాటలో పయనించి పార్టీకి చేటు తీసుకువస్తారని, క్రమశిక్షణకు మారుపేరుగా టీడీపీ ఉండాలి అంటే వేటు వేయడమే కరెక్ట్ అనే అభిప్రాయానికి రావడంతో వంశీ పై వేటు పడినట్టు తెలుస్తోంది.

వంశీ టిడిపిలోనే ఉంటూ జగన్ కు మద్దతుగా నిలబడాలని నిర్ణయించుకున్నట్లు బహిరంగంగానే చెప్పేయడం బాబు కు బాగా ఆగ్రహం తెప్పించిందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube