గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.నిన్న సీఎం వైఎస్ జగన్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు భారీ స్థాయిలో కౌంటర్లు వేశారు.
రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉంది అంటూ .బాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, నీ తాత ఖర్జూర నాయుడు రాజ్యాంగం నీ హయాంలో ఉందా అంటూ సెటైర్లు వేశారు.
అంతేకాకుండా ఏ రాజ్యాంగం ప్రకారం కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడం కట్టారు అంటూ చంద్రబాబు ని వంశీ ప్రశ్నించారు.నిన్న చంద్రబాబు ఎన్నికల సంఘం గురించి ప్రస్తావిస్తూ.
జగన్ పై భారీ స్థాయిలో విమర్శలు చేశారు.అసలు రాష్ట్రంలో ఎన్నికల సంఘం వద్దు అన్న రీతిలో సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
అంతే కాకుండా రాజ్యాంగ వ్యవస్థలపై జగన్ కి గౌరవం లేదని నమ్మకం లేదని వ్యాఖ్యానించారు.
దీంతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అదేస్థాయిలో వల్లభనేని వంశీ తాజాగా కౌంటర్లు వేయడం జరిగింది.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో బిజెపి ఉన్న కొద్ది బలపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఇప్పుడు హిందుత్వ ఎజెండాతో రాజకీయాలు చేస్తున్నారని వల్లభనేని వంశీ భారీ స్థాయిలో బాబు ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరుపై కౌంటర్లు వేశారు .