ఇప్పటి వరకు టిడిపి చంద్రబాబు , ఆయన కుమారుడు నారా లోకేష్ పై విమర్శలతో విరుచుకుపడిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై టిడిపి నేతలు ఎదురుదాడికి దిగడం, ఆ తరువాత గన్నవరం టీడీపీ ఆపీసుని వంశీ వర్గీయులు ధ్వంసం చేయడం , ఆ తరువాత టీడీపీ నేతలు అరెస్ట్ కావడం ఇలా ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ వ్యవహారం పై వంశీ , టిడిపి నేతల పై విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.
తాజాగా టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడిని టార్గెట్ చేసుకుని వంశీ విమర్శలతో నిలుచుకుపడ్డారు.గన్నవరం వ్యవహారంపై అచ్చెన్న వంశీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్న క్రమంలో, వంశీ అచ్చెన్న పై ఫైర్ అయ్యారు.అచ్చెన్న నాయుడు ఓ సమయంలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించారని, ఆ విషయం పెద్దది కావడంతో అప్పుడు చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నారని వంశీ సంచలన ఆరోపణలు చేశారు.ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయని, తన జోలికి అచ్చన్న వస్తే ఆ చిట్టా విప్పుతానని వంశీ వార్నింగ్ ఇచ్చారు.‘పార్టీ లేదు బొక్కా లేదు.గట్టి చెట్ని వేయమన్న వ్యక్తి అచ్చెన్న నాయుడు అంటూ వంశీ విమర్శించారు.
అచ్చెన్న ఓ మహిళ ఆఫీసర్ పై అసభ్యంగా ప్రవర్తించి చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారు ఆయన నా గురించి మాట్లాడితే నేను అందరి చిట్టా విప్పుతా అంటూ వంశీ హెచ్చరించారు.టిడిపి అధినేత చంద్రబాబు రాసిన లేఖల పైన వంశీ ఫైర్ అయ్యారు.” చేతగానోడు రాసే ఉత్తరాలతో ఉపయోగం లేదు ‘ అంటూ విమర్శలు చేశారు.చంద్రబాబుకు అధికారం దక్కలేదని మా కుల పత్రికలు చాలా బాధలో ఉన్నాయి.
అందుకే కావాలని అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి.చంద్రబాబుకు డబ్బు కోసం పదవులు అమ్ముకున్నాడు.
ఇచ్చిన మాటకు కట్టుబడే ఉండే నాయకుడు జగన్.అందుకే అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారు అంటూ వంశీ ప్రశంసించారు.