గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటీవలే తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెల్సిందే.ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మొదట కాస్త మౌనంగా ఉన్న వంశీ ఇటీవల వైకాపాలో జాయిన్ అవ్వబోతున్నట్లుగా ప్రకటించేందుకు ప్రెస్మీట్ ఏర్పాటు చేశాడు.
వంశీ ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో తెలుగు దేశం పార్టీపై చాలా సీరియస్గా వ్యాఖ్యలు చేశాడు.ఆ తర్వాత నిన్న ఒక టీవీ ఛానెల్లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అత్యంత దారుణమైన పదజాలంతో తనకంటే పెద్ద వ్యక్తి అయిన ఒక ఎమ్మెల్సీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
చంద్రబాబు నాయుడును ఒక్క గుద్దు గుద్దితే ముసలి పళ్లు రాలుతాయని హెచ్చరించాడు.నారా లోకేష్ను ఇన్ని రోజులు బాబు బాబు అంటూ పిలిచిన వంశీ ఇప్పుడు ఎన్టీఆర్తో పోలిక పెట్టి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అంటూ కామెంట్ చేశాడు.
తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడు వైకాపాలో ఉన్న వారు అన్నం తినే వారు కాదంటూ కామెంట్ చేసిన వంశీ ఇప్పుడు తెలుగు దేశం పార్టీలో అంతా దద్దమలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.గతంలో తెలుగు దేశం పార్టీ నాయకులతో ఎంతో సన్నిహితంగా ఉన్న వంశీ ఇప్పుడు వారిపై చేస్తున్న ఆరోపణలు మరియు వ్యాఖ్యలతో అంతా నోరు వెళ్లబెతున్నారు.
వంశీతో అసలు పెట్టుకోవడం వద్దుర బాబోయ్ అంటున్నారు.అయ్యప్ప మాలలో ఉండి కూడా వంశీ నోరు అదుపులో పెట్టుకోక పోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.