తెలుగుదేశం పార్టీకి ఇంకా గన్నవరం తలనొప్పులు తగ్గినట్టు కనిపించడంలేదు.పార్టీకి రాజీనామా చేసి ఏ పార్టీలోనూ చేరకుండా వేచి చూస్తున్న వల్లభనేని వంశీ తన రాజీనామా దగ్గర నుంచి ఎక్కడా ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా సమన్వయం పాటిస్తూ వస్తున్నాడు.
ఆయన వైసీపీలోకి వెళ్తాడు అనే ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్న సమయంలో తాజాగా తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు వంశీ.
ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పించాడు వంశీ.ఈ క్రమంలోనే హీరో జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు.2009లో తన ప్రాణాలను ఫణంగా పెట్టి తెలుగుదేశం కోసం పోరాడిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తరువాత టీడీపీకి ఎందుకు దూరం అయ్యారో చంద్రబాబు బయటపెట్టాలన్నారు.
టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా నల్లపూసగా మారిపోయారని, చంద్రబాబు ఆయన్ను రాజకీయంగా వాడుకుని వదిలేశారని అంటూ వంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ లో కాక పుట్టిస్తున్నాయి.ముఖ్యంగా ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావడంపై రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.