రొమాంటిక్ క్రైమ్ కథ సిరీస్ తో యువ ప్రేక్షకులకి చేరువైన మనోజ్ నందం హీరో గా , సొంతవూరు గంగ పుత్రులు, గల్ఫ్ లాంటి సామాజిక చిత్రాలతో ప్రేక్షకులకి సుపరిచితుడైన దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి కలయికలో వస్తున్న సామజిక కథా చిత్రం ‘ వలస’ జనవరి ఒకటవ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.కరోనా కారణంగా విధించబడ్డ లొక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ వలస కార్మికుల జీవితమే ఈ కథ.
మనోజ్ నందం ,తేజు అనుపోజు, వినయ్ మహాదేవ్, గౌరీ తదితరులు నటించగా, నరేష్ కుమార్ మడికి కెమెరా, ప్రవీణ్ ఇమ్మడి సంగీతం, నిర్మాత యక్కలి రవీంద్ర బాబు , రచన , దర్శకత్వం సునీల్ కుమార్ రెడ్డి.