యంగ్ టైగర్ ను అభిమానించే సిని జనాల్లో వక్కంతం వంశీ ఒకరు.రచయితగా జూనియర్ కు ఎన్నో మంచి సినిమాలందించిన వక్కంతం వంశీ రెండేళ్ల నుండి తారక్ సినిమాతో దర్శకుడిగా మారాలని చూస్తున్నాడు.
ఇక వారం రోజుల క్రిందట అయితే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా టైటిల్ కూడా దడ్కన్ అంటూ ప్రచారం జరిగింది.మరి ఇంతలో ఏమైందో ఏమో కాని జూనియర్ కాంపౌండ్ నుండి వక్కంతం వంశీ బయటకు వచ్చేశాడని ఎక్స్ క్లూజివ్ టాక్.
తారక్ ను అమితంగా అభిమానించే వక్కంతం ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో కారణాలు తెలియలేదు కాని వంశీ జూనియర్ కు దూరమయ్యాడట.
అయితే ఇదంతా సినిమా ఉంటుందో లేదో తెలియని సమయంలో దడ్కన్ టైటిల్ కూడా ఎనౌన్స్ చేయడం వల్లే వచ్చిందని కొందరంటున్నారు.
ఇక మరో పక్క మాత్రం జనతా గ్యారేజ్ తర్వాత వక్కంతం వంశీ సినిమా చేస్తానని మాటిచ్చిన జూనియర్ మరోసారి ఆలోచనలో పడ్డాడట.వంశీని మరికొద్ది రోజులు వెయిట్ చేయమని అడిగేసరికి వంశీ తారక్ ను కాదని వెళ్లిపోయాడని తెలుస్తుంది.
వీటిలో నిజం ఏదో క్లారిటీ రాలేదు కాని ఎన్.టి.ఆర్ వక్కంతం వంశీల మధ్య ఏదో జరుగుతుంది అన్నది మాత్రం చెప్పగలం.మరి ఈ గ్యాప్ ఎంత దూరం వెళ్తుందో చూడాలి.