నేచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘వి’ ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫాంపై రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాపై రిలీజ్కు ముందే అదిరిపోయే అంచనాలు నెలకొన్నాయి.
వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూసినా, లాక్డౌన్ వల్ల ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది.ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓటీటీలో భారీ అంచనాల నడుమ రిలీజ్ చేశారు.
కానీ సినిమాకు అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో ఆయన ఇప్పుడు తీవ్ర ఆలోచనలో పడ్డాడట. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తోన్న నెక్ట్స్ మూవీ వకీల్ సాబ్ కూడా రిలీజ్కు రెడీగా ఉంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల తరువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ చేస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్న ఈ సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే వార్త ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.
కాని, నాని ‘వి’ చిత్రం ఫలితంతో వకీల్ సాబ్ భవిష్యత్తు పూర్తిగా మారిపోయిందని దిల్ రాజు సన్నిహితులు అంటున్నారు.
ఈ సినిమా షూటింగ్ను కూడా అతి త్వరలో పూర్తి చేసి భారీ ఆఫర్తో ఓటీటీలో రిలీజ్ చేయాలని తొలుత అనుకున్నారట.
కానీ ఈ సినిమాకున్న క్రేజ్ను పూర్తిగా క్యాష్ చేసుకోవాలంటే, ఏదేమైనా ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని ఇప్పుడు దిల్ రాజు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.దీంతో ఎంత ఆలస్యమైనా కూడా ఈ సినిమా వెండితెరపై మాత్రమే కనిపిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక పవన్ కళ్యాన్ లాయర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.బాలీవుడ్లో సూపర్ సక్సెస్ అయిన పింక్ చిత్రానికి తెలుగు రీమేక్గా ఈ సినిమా వస్తుండగా, వేణు శ్రీరామ్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా డైరెక్ట్ చేస్తున్నాడు.
మరి వకీల్ సాబ్ థియేటర్లలో ఎప్పుడు అడుగుపెడతాడో చూడాలి.