టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ కూడా ఒకటి.ఈ సినిమా కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాతో దాదాపు రెండేళ్ల తరువాత పవన్ వెండితెరపై కనిపిస్తుండటంతో ఆయన అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఉన్నారు.బాలీవుడ్లో సూపర్ సక్సెస్ అందుకున్న పింక్ చిత్రానికి రీమేక్గా వస్తున్న ఈ సినిమాతో పవన్ మరోసారి అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమాను తొలుత వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.దీంతో ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
అయితే ఇటీవల మల్టీప్లెక్స్ థియేటర్లు తెరుచుకోవడం, ఇంకా సింగిల్ స్క్రీన్ థియేటర్లు తెరుచుకోకపోవడంతో, ఇప్పుడే వకీల్ సాబ్ లాంటి భారీ చిత్రాన్ని రిలీజ్ చేయడం తగదని పలువురు అంటున్నారు.ఒకవేళ థియేటర్లు తెరిచినా కూడా సగం అక్యుపెన్సీతో సినిమా నడిపించడంతో భారీ నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొందని, అందుకే ఈ సినిమాను ఇప్పట్లో రిలీజ్ చేయకపోవచ్చని చిత్ర వర్గాలు అంటున్నాయి.
దీంతో ఈ సినిమాను వచ్చే వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ సినిమాను రిలీజ్ చేసేనాటికి థియేటర్లకు జనం ఎక్కువ సంఖ్యలో రావడం మొదలుపెడతారని చిత్ర వర్గాలు అంటున్నాయి.
అయితే ఈ సినిమాను వచ్చే వేసవికి రిలీజ్ చేస్తే అప్పటికి ప్రజల్లో కరోనా భయం పోతుందని, దీంతో థియేటర్లకు రావడం మొదలుపెడతారని చిత్ర యూనిట్ భావిస్తోంది.మరి వకీల్ సాబ్ను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ వేస్తున్న లెక్కలు ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.
ఇక ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తుండగా, నివేదా థామస్, అంజలి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.