పవన్ కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా వకీల్ సాబ్.బాలీవుడ్ పింక్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా నటిస్తున్నాడు.
లాక్ డౌన్ కి ముందే ఈ సినిమా మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది.కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ పెట్టడంతో ఒక ముప్పై రోజుల షెడ్యూల్ పెండింగ్ లో ఉండిపోయింది.
లాక్ డౌన్ సడలింపులుతో ఈ సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ చేశారు.అప్పటి నుంచి ఏకధాటిగా షూటింగ్ చేస్తున్నారు.
మధ్యలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ మీటింగ్స్ కారణంగా కొంత ఆలస్యం అవుతూ వస్తున్న ఎట్టకేలకు సినిమా షూటింగ్ ముగించేశారు.తాజాగా చిత్ర యూనిట్ వకీల్ సాబ్ కి ప్యాకప్ చెప్పేశారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అందరూ పవన్ కళ్యాణ్ తో ఫోటోలు తీసుకున్నారు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా శృతి హాసన్ నటిస్తూ ఉంది.
కీలక పాత్రలో నివేతా థామస్ కనిపించబోతుంది.బాలీవుడ్ లో పింక్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.
ఆ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతూ ఉండటం వలన సినిమాపై గట్టి నమ్మకాలు ఉన్నాయి.
ఇక పవన్ కళ్యాణ్ కి తగ్గట్లు ఒరిజినల్ కథలో కొన్ని మార్పులు చేసి యాక్షన్ సన్నివేశాలని కూడా సినిమాలో పెట్టినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే వకీల్ సాబ్ కి ప్యాకప్ చెప్పేయడంతో ఇక జనవరి ఫస్ట్ వీక్ నుంచి పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమా షూటింగ్ ని గ్యాప్ లేకుండా సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు.
ఇక అందుకు తగ్గట్లుగానే క్యాస్టింగ్ ని కూడా ఖరారు చేశారు.