పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత నటించిన సినిమా వకీల్ సాబ్ రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.మొదటి మూడు రోజులు ఈ సినిమాకి పవర్ స్టార్ అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఇప్పుడు మహిళా ప్రేక్షకులు సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు.ఇప్పటి వరకు పవన్ నటించిన రెగ్యులర్ సినిమాల తరహాలో కాకుండా మహిళల సమస్యలు, వారిపై జరుగుతున్న వేధింపుల మీద ఇందులో చర్చించడం, కాంటెంపరరీ ఇష్యూని టచ్ చేయడంతో విపరీతంగా మహిళలకి నచ్చేస్తుంది.
ముఖ్యంగా కోర్టు ఎపిసోడ్ కి మహిళలు సైతం క్లాప్స్ కొడుతున్నారు అంటే సినిమాకి పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.ఇదిలా ఉంటే ఏపీలో అధికార పార్టీ ఈ సినిమాకి కొంత అడ్డంకి పెట్టె ప్రయత్నం చేస్తున్న ప్రజల నుంచి మాత్రం మంచి స్పందన వస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాని ఈ నెల ఆఖరున అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రచారం నడిచింది. అయితే సినిమా మరో పదిరోజులు ఆగితే ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా… థియేటర్ కి ఎందుకు వెళ్ళడం అని ఫ్యామిలీ ఆడియన్స్ అనుకుంటారనే ఉద్దేశ్యంతో ఈ ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ వ్యతిరేక వర్గం సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లు చిత్ర యూనిట్ కూడా గ్రహించింది.
దీంతో వెంటనే సినిమా ఒటీటీ రిలీజ్ పై స్పష్టత ఇచ్చారు.ఓటీటీలో త్వరలో వకీల్ సాబ్ వచ్చేస్తుందని జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధం అని, ప్రస్తుతం థియేటర్ లో సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.
ఇప్పట్లో వకీల్ సాబ్ ని ఒటీటీలో రిలీజ్ చేసే ఆలోచన కూడా లేదని, ప్రతి ఒక్కరు థియేటర్ కి వచ్చి సినిమాని సిల్వర్ స్క్రీన్ పై వీక్షించి ఆస్వాదించాలని తెలిపారు.